Prabhakar Reddy | మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి గర్హనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి ఖండించారు. ఓడిపోతున్నామనే అక్కసుతో దాడులకు ప్రతిపక్షాలు దాడులకు తెగబడుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని, ప్రజాతీర్పే అంతిమం అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జన రంజక పాలనతో రాబోయే ఎన్నికల్లో వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం అత్యంత తీవ్ర ఘటన అంటూ మండిపడ్డారు. నీచ రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు.