హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రైతులకు అధిక రుణాలిచ్చి ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి బ్యాంకర్లను కోరా రు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే అగ్రగామి గా ఎదిగిందన్నారు. దేశంలో వ్యవసా య ఉత్పత్తుల సగటులో రాష్ట్రం మొదటి స్థానానికి చేరుకొన్నట్టు తెలిపారు. అదే సమయంలో పంటల వైవిధ్యీకరణను సమర్థంగా అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయిల్పామ్ సాగు కోసం రైతులకు ఎక్కువ రుణాలు అందించి ప్రోత్సాహించాలని సూచించారు.
జిల్లాల్లో వ్యవసాయ పరిశ్రమలు..
ప్రతి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ఇదివరకే దృష్టిపెట్టినట్టు నిరంజన్రెడ్డి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు, డెయిరీ రం గం బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరారు. బ్యాంకులు కేవలం పట్టణాల్లోని ఆస్తులు, భూములనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని, ఈ విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వ విధానాల మూలంగా గ్రామీణ ప్రాంతాల భూము ల ధరలు భారీగా పెరిగాయని, పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలన్నా రు. రాష్ట్రంలో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వేరుశనగకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నదని, ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహం అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పా రు. 2022-23కి వ్యవసాయ రంగానికి బ్యాంకులిచ్చే రుణ లక్ష్యంలో 62 శాతమే పూర్తయిందని, ఈ విషయంలో బ్యాంకు లు మరింత ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్రోస్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు అమిత్జింగ్రాన్, నాబార్డ్ జీఎం డాక్టర్ హరగోపాల్, ఆర్బీఐ డీజీఎం చక్రవర్తి పాల్గొన్నారు.