జనగామ, అక్టోబర్ 30 : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్(BRS) పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వెల్పుకొండ లింగయ్య, డొంక యాకయ్య, తొర్రూరు మాజీ ఎంపీపీ గంపల శంకరయ్య అధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి(Minister Errabelli )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తొర్రూరు ఆటో యూనియన్..
తొర్రూరుకు చెందిన ఆటో యూనియన్ నాయకులు మంగళపల్లి యాకయ్య, కుంటకొమ్ము నాగరాజు, ఖమ్మం పాటీ దినేష్, బానొత్ శ్రీను, గొల్లపల్లి నరేష్, బంధు వెంకటేష్, మంగళపల్లి సాగర్, ప్రభు, దయాకర్, శ్రీకాంత్, నల్లగురి రాంమూర్తి, సాయి, బిన్నీ, ఉపేందర్, మధు, అశోక్, సుధాకర్, గణేష్ తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామం నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఈదుల కుంట తండా, భోజ్యా తండాల్లో..
ఈదుల కుంట తండా, భోజ్యా తండాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎన్ రాములు, రామ్ చరణ్, భిక్షం, సంతోష్, యాకూబ్, నవీన్, సందీప్, సురేష్, సుధాకర్, రామ చంద్రు, బుజ్జి, విజయ్, లింగా, బిక్షం నరేష్, రమేష్, నాగేష్, బి.రమేష్, సూర్య, తేజ, వెంకన్న, దిలీప్, పన్య, వంశిలలిత, నెహ్రూ, రవి, ఆగా, రావుజ, రాజు తదితరులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
దేవరుప్పులలో..
దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ నాయకులు చింత భిక్షపతి, చింత మల్లయ్య, జోగు సంతోష్, జోగు ఎల్లయ్య, ఇంద్రమ్మ, గడ్డం స్వామి, జలగం యాదగిరి, బాకి ఉప్పలయ్య, ఉప్పల కొండయ్య, మల్లమ్మ, చింత పుల్లయ్య, జోగు యాదగిరి, సాయి ప్రకాశ్, యేసుబు, పాపిల్ల డానియల్ తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరుప్పుల మండల పెద్దతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు గుగులోత్ విఠల్, యువజన నాయకులు గుగులోత్ భాస్కర్ తదితరులు బీఆర్ఎస్ చేరారు.
పాలకుర్తిలో..
పాలకుర్తికి చెందిన కత్తుల భిక్షపతి అధ్వర్యంలో 15 మంది, ఎడవెల్లి అంజయ్య, కత్తుల సోమయ్యల అధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కొడకండ్ల మండలంలో..కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం కాంగ్రెస్కు చెందిన పండుగ నారాయణ అధ్వర్యంలో 10 మంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.