మహబూబాబాద్ : అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకంలో భాగంగా ఎంపికైన తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ కింద దేశంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ని నెలకొల్పింది.
యువ శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఈ మిషన్ ద్వారా దేశంలో 9వేల 500 అటల్ టింకరింగ్ ల్యాబ్లను నెలకొల్పారన్నారు. జిల్లాలో ఈ పథకం మూడు ప్రభుత్వ పాఠశాలలు, రెండు ప్రైవేట్ పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు. కాగా తొర్రూరు ప్రభుత్వ పాఠశాల కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ కు ఎంపిక అవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టం అన్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం ద్వారా మన ప్రాంతానికి చెందిన విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా శాస్త్రవేత్తలుగా తయారై ఈ ప్రపంచాన్ని మరింత సమర్థవంతంగా సానుకూలంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.