జనగామ : తొలిదశ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, దర్గ్యా నాయక్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. ఆదివారం దర్గ్యా స్వగ్రామం దేవరుప్పుల మండలం ధర్మపురం తండాకు వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆయన ఆయు ఆరోగ్యాలతో నిండూ నూరేండ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆనాటి పోరాట స్మృతులను నెమరు వేసుకున్నారు.
నాటి అమరుల త్యాగాలను కీర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడులను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దర్గ్యా నాయక్ను ఘనంగా సన్మానించారు.