కొడకండ్ల, మే 27 : సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా రు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల-1, 2 ఎంపీటీసీల పరిధి, ఏడునూతుల-నర్సింగాపురం మామిడితోటలో ఏడునూతుల, నర్సింగాపురం, రేగులతండా, రంగాపురం ఎంపీటీసీల పరిధి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా రు. ఈ సందర్భంగా నర్సింగాపురంలో రూ. 16 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి.. రూ.60 లక్షలతో పలు అ భివృద్ధి పనులను ప్రారంభించారు. అనంత రం ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. మం త్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధం గా అభివృద్ధి, సం క్షేమ పథకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. 57 ఏండ్లు నిండిన అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు ఇస్తామని చెప్పా రు. తాను ఒక్కో మండలం లో రూ.100 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అనంతరం ఏడునూతుల గ్రామ బీజేపీ అధ్యక్షుడు పలుగు కుమార్, సన్నిహితులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.