పర్వతగిరి ; ఉపాధి కూలీలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గడ్డపార పట్టారు. మంగళవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం శివారు నల్లగుంటతండాలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించారు. వారితో కలిసి కొద్దిసేపు పనిచేశారు. ఉపాధి పనికి సంబంధించిన డబ్బులు సరిగా వస్తున్నాయా అని అడిగి తెలుసుకొన్నారు.