జనగామ : ఈ నెల 20న జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలెక్టరేట్తో పాటు టీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం పరిశీలించారు. అనంతరం సీఎం బహిరంగ సభా స్థలాన్ని సందర్శించారు. ఏర్పాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ఏర్పాట్లలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా కలిసి చేస్తున్నామన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద సమావేశమై పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను మరోసారి పరిశీలించనున్నట్లు వివరించారు.