జనగామ : కొండకండ్లలోని రాజరాజేశ్వరి దేవాలయంలో మహాచక్ర శరత్ కాల మహోత్సవం పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని మంత్రి అన్నారు. అమ్మ వారి దయతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలాగే.. దేశం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.