హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఆయన మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లే జనగామ జిల్లాల్లో నీటి సమస్య తీరిందని, దేవాదుల ద్వారా జిల్లాలో ప్రతి చెరువు నింపామన్నారు.
కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కేసీఆర్ కృషి వల్లే ఇవాళ తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా జనగామ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ వెనుక నిలబడి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ బహిరంగ సభకు లక్షకుపైగా ప్రజలు హాజరవుతారని మంత్రి పేర్కొన్నారు.