హైదరాబాద్ : సినీ, రాజకీయ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించి.. కుటుంబీకులు, ప్రభాస్ను ఓదార్చారు. కృష్ణం రాజు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అనేక సినిమాల్లో విలన్గా హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో ‘రెబల్ స్టార్’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు, లోక్సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని మంత్రి అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, అభివృద్ధి అభిలాషి, మంచి మనసున్న మహరాజు కృష్ణంరాజు అని కొనియాడారు. వారి లేని లోటు అటు సినీలోకానికి, ఇటు రాజకీయ రంగానికి తీరని లోటలని మంత్రి తెలిపారు.