Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. బడి ఎలా ఉంది? సౌలత్లు ఎలా ఉన్నాయ్ అంటూ ఆరా తీశారు. బడిని మంచిగా కాపాడుకోవాలని, గుడి లెక్కనే చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా వేములకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మంత్రి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. వాళ్లతో కలిసి బెంచీలపై కూర్చొని ముచ్చటించారు.
ముచ్చట పడ్డారు. బడి ఎట్లున్నది? బడిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బడి గుడి లెక్క ఉన్నది కదా! ఈ బడిని గుడి లెక్కనే చూసుకోవాలి. ఈ బడిని బాగు చేసింది ఎవరో తెలుసా? సీఎం కేసీఆర్ అని చెప్పి.. బడిని ఇంత బాగా చేసిన సీఎం సార్కు జై కొడదామా?.. జై కేసీఆర్!! అంటూ విద్యార్థులతో కలిసి మంత్రి నియంత్రించారు. కొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల సముదాయాన్ని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. రూ.1.75కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు.
పాఠశాల భవనాలకు రంగులు వేయడంతో పాటు, గార్డెన్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కంప్యూటర్లు, గ్రంథాలయం, ఆట స్థలం, టాయిలెట్స్ సౌకర్యాలు కల్పించారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ఆయా తరగతి గదులను పరిశీలిస్తూ ఒక క్లాస్ రూమ్లోకి వెళ్లారు. పిల్లలను చూసిన ఆయన.. వారితోపాటు బెంచీపై కూర్చొని ముట్టిస్తూ చిన్నపిల్లడిలా మారిపోయారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు వారి వివరాలను తెలుసుకున్నారు. కుశల ప్రశ్నలు వేశారు. బడి ఎట్లున్నది అంటూ ప్రశ్నించారు. ఈ బడి ఈ విధంగా ఆధునీకరణ చెందడానికి కారణం ఎవరో తెలుసా? అని అడిగారు. పిల్లలంతా సీఎం కేసీఆర్ సార్ అని చెప్పగా.. మరి సీఎం కేసీఆర్ సార్కు జై కొడదామా?! అంటూ మంత్రి జై కేసీఆర్ సార్ అని అనడంతో పిల్లలంతా పెద్ద పెట్టున కేసీఆర్కి జై కొట్టారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడడంతో పాటు సెల్ఫీలు దిగారు.