హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ 33వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంలో కళాకారుల సేవలు మరువలేనివి కళాకారుల ఆటాపాట లేకుండా రాష్ట్ర సాధనను ఊహించుకొలేమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కళాకారులను సీఎం కేసిఆర్ గుర్తించారన్నారు.
సుమారు 500 మంది కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారన్నారు. కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న కళాకారులకు అభినందనలు తెలుపడంతో పాటు, జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీని అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులు హాజరయ్యారు.