హనుమకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంకానున్న సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుకొండలోని నివాసంలో గురువారం అభినందించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ఒక రోజు ముందే పోచంపల్లి మినహా మిగతా అభ్యర్థులంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో కేవలం శ్రీనివాస్రెడ్డి మాత్రమే బరిలో ఉన్నారు.
ఆయన ఏకగ్రీవం ప్రకటన నామినేషన్లకు చివరి రోజు శుక్రవారం సాయంత్రం వెలువడనుంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మల్యే అరూరీ రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, లింగాల ఘనపూర్ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి తదితరులు శ్రీనివాస్రెడ్డిని అభినందించారు.