హైదరాబాద్ : ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ మరణంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం ప్రకటించారు. 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని కొనియాడారు. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు అమూల్యమైన సేవలందించారని పేర్కొన్నారు. తెలుగు సినీ చరిత్రలో బుర్రిపాలం బుల్లోడు నిలిచిపోతారని, ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.