హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): నదీజలాల పంపిణీని విభజన చట్టం లో పొందుపరిస్తే దాన్ని అంగీకరించబోమని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మొండిగా వాదిస్తున్నారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు రాష్ర్టాలకు సంబంధించినదని, అయితే.. ఏపీకి ప్రాజెక్టులు అప్పగించబోమని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సరికాదన్నారు. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా ఏపీకి అవసరం లేదని, బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించిందని మంత్రి అంబటి రాంబాబు గుర్తుచేశారు.