హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధిలో మైనింగ్ది కీలకపాత్ర అని, ఈ రంగంలో నిపుణుల కొరతలేకుండా చూడాల్సిన అవసరమున్నదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. ముఖ్యంగా మైనింగ్రంగాన్ని విద్యతో అనుసంధానించాలని సూచించారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చాప్టర్, అలుమ్ని ఆఫ్ మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో ఇండస్ట్రీ అకాడమియా ఇంటరాక్షన్ ఇన్ మైనింగ్ ఇండస్ట్రీ అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో లింబాద్రి మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మైనింగ్రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగడానికి ఆస్కారమున్నదని చెప్పారు. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ.. ఓయూలో మైనింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును మళ్లీ ప్రవేశపడతామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సుమిత్దేబ్, సుశీల్కుమార్, బీ రమేశ్కుమార్, ఆర్వీ రామ్మోహన్రావు, సంజయ్పట్నాయక్, డీఎన్ ప్రసాద్, ఎంఎస్ వెంకట్రామయ్య, బీ మహేశ్, స్వామి కృష్ణాజీరావు, పీవీఆర్ఎస్ రాజు, ఎండీ ఫసియుద్దీన్, టీవీ చౌదరి, వీడీ రాజగోపాల్, బీఆర్వీ సుశీల్కుమార్, సురేంద్రమోహన్, ఎం నర్సయ్య, కేజే అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.