హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: పోలీసు సిబ్బందిని దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడిన ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్పూర్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ అలియాస్ తాహాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం భోలక్పూర్ మసీదు సమీపంలో రాత్రి 2 గంటలు దాటినా 4ఎం అనే హోటల్ తెరిచి ఉండటంతో నైట్ డ్యూటీలోఉన్న పోలీసు సిబ్బంది యజమాని లతీఫ్ను పిలిచి హోటల్ మూసివేయాలని సూచించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గౌసు ద్దీన్ కానిస్టేబుళ్లు అనిల్కుమార్, కారయ్య, ఎస్ఐ కృష్ణయ్యలను దుర్భాషలా డుతూ, విధులకు ఆటంకం కలిగించాడు. కానిస్టేబుల్ అనిల్ ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులు గౌసుద్దీన్పై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.
విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కార్పొరేటర్ వ్యవహార శైలిని ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి కేటీఆర్ సీరియస్గా స్పందించారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేశారు.