న్యాల్కల్: సంగారెడ్డి జిల్లాలోని మెటల్ కుంట జెడ్పీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు (ZP HM) ప్రభాకర్ రావు కులకర్ణికి కామన్వెల్త్ ఒకేషనల్ యూనివర్సిటీ కింగ్డమ్ తోంగ డాక్టరేట్ ప్రధానం చేసింది. కార్పొరేటు దీటుగా సర్కారు బడిలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషికిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కామన్వెల్త్ లొకేషన్ యూనివర్సిటీ కింగ్డమ్ వైస్ చాన్సలర్ ప్రియదర్శన్ నాయక్ ఆయనకు డాక్టరేట్ పట్టాను ప్రధానం చేశారు.
విద్యాభివృద్ధికి తాను చేస్తున్న సేవలకు ఫలితంగా డాక్టరేట్ పట్టాను పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రభాకర్ రావు అన్నారు. కాగా, ప్రభాకర్ రావుకు డాక్టరేట్ రావడంపట్ల ఎంఈఓ మారుతి రాథోడ్, మెటల్ కుంట గ్రామ సర్పంచ్ పీటర్ రాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు.