హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికై, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన ప్రత్యేక క్యాటగిరీ (దివ్యాంగ) అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహంచనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు జాబితాను ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. కేటాయించిన తేదీల్లో మెడికల్ పరీక్షలకు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రకటించింది.
దృష్టిలోపం అభ్యర్థులు మెహదీపట్నంలోని సరోజినిదేవీ కంటి దవాఖానలో, అంగవైకల్యం అభ్యర్థులు అఫ్జల్గంజ్లోని ఉస్మానియా దవాఖానలో, వినికిడి లోపం అభ్యర్థులు కోఠిలోని ఈఎంటీ దవాఖానలో హాజరుకావాలని టీఎస్పీఎస్సీ సూచించింది.