హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పాత్రికేయుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ పూర్వ స్టీరింగ్ కమిటీ (2000కు పూర్వం) బృందం గురువారం సమాచారభవన్లో అల్లం నారాయణను కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థ లాలు వచ్చేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఇంటి స్థలాలు వస్తాయన్నారు.
అర్హత కలిగినవారికి నిబంధనల ప్రకారం స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. పాత్రికేయులు ఎవరూ కూడా స్థలాల విషయంలో ఆందోళన చెందవద్దని సూచించారు. ప్లాట్లు పొందలేకపోయిన సొసైటీల్లో సీనియర్ సభ్యుల ప్రతిపాదనలు పరిశీలించేందుకు అభ్యంతరం ఉండబోదన్నారు. కార్యక్రమంలో జూబ్లీహి ల్స్ హౌసింగ్ సొసైటీ నాన్ అలాటిస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.