మేడ్చల్, మే 4: బైక్ రైడింగ్లో మేడ్చల్ యువకుడు మహేందర్ రాయల్ సత్తా చాటాడు. జమ్ముకశ్మీర్లోని లడక్ వద్ద రోడ్లు, మొబైల్ సిగ్నల్స్ లేకుండా ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండే ఉమ్లాంగ్ లా పాస్ పర్వతంపైకి బైక్ ద్వారా చేరుకుని గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
గత నెల 28 ఉదయం 10 గంటలకు మరో ఏడుగురు బైకర్లతో కలిసి బయల్దేరిన మహేందర్ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ 4 గంటలపాటు దాదాపు 70 కి.మీ. దూరం ప్రయాణించి 19,024 ఎత్తున్న ఆ పర్వతంపైకి విజయవంతంగా చేరుకున్నాడు. మహేందర్తోపాటు బయల్దేరిన బైకర్లలో మరో నలుగురు కూడా ఆ పర్వతంపైకి చేరుకోగా, మిగిలిన ముగ్గురు మధ్యలోనే ఆ సాహసాన్ని విరమించుకుని వెనక్కి తిరిగొచ్చారు.