ములుగు : తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కొమ్ము పూజారి సిద్ధబోయిన సాంబయ్య(38) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సాంబయ్య బుధవారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుండి గద్దెల వరకు తీసుకువచ్చేందుకు సాంబయ్య కొమ్ము పూజారిగా వ్యవహరిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఫిబ్రవరి మాసంలో జరిగి మహా జాతర అనంతరం సాంబయ్య అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందినట్లు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుడు సాంబయ్యకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.