మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ) ;మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి బుధవారం కొద్దిసేపు కూలీలతో కలిసి నాట్లు వేసి సందడి చేశారు. బుధవారం హవేళీఘనపూర్ మండలం చౌట్లపల్లి శివారులో మహిళా కూలీలు వరినాట్లు వేయడాన్ని గమనించిన ఆమె తన కారు ఆపి నేరుగా పొలంలోకి వెళ్లారు. వాన కురుస్తున్నా లెక్కచేయకుండా సరదాగా పాట పాడుతూ కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఎమ్మెల్యే తమతో కలిసి నాట్లు వేయడంతో రైతులు, కూలీలు సంబురపడ్డారు. –