హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టును నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)సబ్జెక్టుల జాబితాలో చేర్చాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూజీసీకి లేఖ రాయాలని జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డికి బుధవారం వినతిపత్రం అందచేశారు. నెట్ పరీక్ష జాబితాలో ఆ సబ్జెక్ట్ లేని కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలంటే, యూజీసీ నెట్లో గానీ, సీఎస్సార్ నెట్లోగానీ క్వాలిఫై తప్పనిసరి చేశారని గుర్తుచేశారు. ఆ పరీక్షలకు హాజరవ్వాలంటే నెట్ జాబితాలో మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టు చేర్చాలని కోరారు.