హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నూతన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించి, సెప్టెంబర్ 30 నాటికి ముగించనున్నట్టు తెలిపింది. మొదటివిడత కౌన్సెలింగ్కు 20 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు.