హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో తమ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించినట్టు ప్రముఖ విద్యాసంస్థ మా స్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. సీఎంఏ ఇంటర్లో మొదటి 50 ర్యాంకుల్లో ఆలిండియా 6వ ర్యాంకుతోపాటు ఇతర ర్యాంకులను 14 మంది సాధించినట్టు పేర్కొన్నారు. సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో టాప్-50 ర్యాంకుల్లో ఆలిండియా 14వ ర్యాంకుతోపాటు ఇతర ర్యాంకులను 14 మంది పొందినట్టు వెల్లడించారు. సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో 28 ర్యాంకులను తమ విద్యార్థులే సాధించారని మోహన్ వివరించారు.