సూర్యాపేట : సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రచారం అలుపెరగకుండా సాగుతున్నది. మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy)తో పాటు పార్టీ శ్రేణులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఊరూరా సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తుండగా, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్లోకి కాంగ్రెస్, బీజేపీ నేతలు క్యూ(Massive Inclusions) కడుతున్నారు. ఆదివారం బీఆర్ఎస్లో చేరికలతో చివ్వెంల మండలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రవి నాయక్, కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్ధి సురేష్ నాయక్తో పాటు, బీజేపీ నాయకులు రాజేందర్ సురేష్, యాదగిరి సాయికుమార్, గిరి తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
వస్త్రం తండాలో బీజేపీకి చెందిన వార్డు మెంబర్లు , పెన్పాడు మండలం లింగాల గ్రామానికి చెందిన టీడీపీ, సీపీఎం పార్టీకి చెందిన యూత్ నాయకులు సైదులు, జానయ్య ,మట్టయ్య మధు యాదవ్ పవన్ తదితరులు, ఆత్మకూరు మండలం బొప్పారం నుంచి కాంగ్రెస్ నాయకులు రంగయ్య, ప్రతాప్ రెడ్డి, తుమ్మల పెన్ పహాడ్ గ్రామాల నుంచి ఉయ్యాల రమేష్ నవీన్ వెంకటేష్, ప్రవీణ్ ,గణేష్, సైదులు తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి కట్టుగా బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.