నాగర్ కర్నూల్ : నల్లమల అడవి(Nallamala forests)లో భారీ అగ్ని ప్రమాదం(Massive fire) చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు సమాచారం. మంటలార్పేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మంటలు అంటుకున్నట్లు తెలిసింది.
గత రెండు రోజుల నుంచి అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అటవీ సిబ్బంది, ట్రెక్కింగ్ వెళ్లిన వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని, మంటలు ఆర్పేందుకు చాలా సమయం తీసుకుంటుందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపలోనే ఉందన్నారు.