నిజామాబాద్ : సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాల్కొండ(Balkonda) బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula )సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పలు కుల సంఘాలు, యువజన సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో మంత్రి వేములకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు.