హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహణకు పకడ్బందీగా భారీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. బుధవారం బీఆర్కేభవన్లో డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి సీఎస్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వజ్రోత్సవాల నిర్వహణ ఇలా..