నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతున్నది. తాజాగా వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, కోమన్పల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, బిజెపి నాయకులు కార్యకర్తలు సుమారు 300 మంది మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఏ పని చేత కానీ వాళ్లు, నాలుకకు నరం లేని వాళ్లు అనేకంమాట్లాడుతూ ఉంటారు. వారికి ఏమన్నా తెలంగాణ ప్రజల అంటే బరువా బాధ్యతనా అని మంత్రి ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులే అన్ని రంగాలలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పురోగతిని చూసి ప్రసంసిస్తున్నారని మంత్రి అన్నారు.
కానీ, ఇక్కడి బిజెపి నాయకులకు కళ్లు కనబడటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో వారే అధికారంలో ఉండి వాళ్లు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వం ఆమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి చేయకుండా ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద మాటలు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు.