BRS Party | హైదరాబాద్ : ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకురాలు మర్సకోల సరస్వతి కారెక్కారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సరస్వతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ట్రైబల్ రైట్స్ ఆర్గనైజేషన్ తూడుం దెబ్బ స్టేట్ ప్రెసిడెంట్ బూర్ష పోచయ్య కూడా బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మీ పాల్గొన్నారు.
మర్సకోల సరస్వతి ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో సరస్వతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని సరస్వతి ఆరోపించారు.