హైదరాబాద్ : ఏపీ రాజకీయ పార్టీల విధానాలపై మావోయిస్టు కీలక నేత గణేష్(Maoist leader Ganesh )స్పందించారు. ముఖ్యంగా జనసేన పార్టీపై(Janasena party) తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అని ఊదరగొట్టాడు. కానీ నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని నీచ రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్కు(Pavan kalyan) స్థిరమైన రాజకీయ విధానం లేదు, అతడికి విశ్వసనీయత తక్కువని ఆరోపించారు. సినీ గ్లామర్, కాపు కులస్తుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మీడియాకు పంపిన లేఖలో పేర్కొన్నారు.