హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత విద్యుత్తు సవరణ బిల్లుతో సవాళ్లు తప్పవని, విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ప్రజలపై అదనపు భారం పడనున్నదని అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐపీఈఎఫ్ చైర్మన్ ఈఈ శైలేంద్ర దూబే నేతృత్వంలో పలువురు యూనియన్ సభ్యులు ఢిల్లీలో కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి పంకజ్అగర్వాల్తో గురువారం భేటీ అయ్యారు.
కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యుత్తు రంగం ఎగుర్కొంటున్న వివిధ సవాళ్లపై చర్చించారు. భేటీలో ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ రత్నాకర్రావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.