హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ విప్ బాల సుమన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఎన్సీపీ మహారాష్ట్ర సోషల్ జస్టిస్ విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ దహెగావ్కర్, చంద్రాపూర్ జిల్లా అధ్యక్షుడు ప్రియదర్శన్ అజయ్ ఇంగ్లే, ఎన్సీపీ చంద్రాపూర్ జిల్లా గుగ్గుస్ నగర అధ్యక్షుడు దిలీప్ ఊషన్న పిట్టల్వార్, చంద్రపూర్ జిల్లా నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హేమంత్సింగ్ గోవింద్సింగ్ ఠాకూర్, జిల్లా ఉపాధ్యక్షుడు నిఖిల్ జగదీశ్ దుర్యోధన్, గుగ్గుస్ నగర బీజేపీ మాజీ కౌన్సిలర్ మహేశ్ లాట్, గుగ్గుస్ నగర ఆప్ మాజీ అధ్యక్షుడు నవీన్ మోరె, గుగ్గుస్ నగర బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ తాలపెల్లి, గుగ్గుస్ నగర భీమ్ సేన యూత్ ప్రెసిడెంట్ సుశాంత్ వాగ్మారే తదితరులు గులాబీ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మాడల్ పాలన మహారాష్ట్రలో రావాలని కాంక్షిస్తూ తాము బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు బీఆర్ఎస్లో చేరిన నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూగూస్ బీఆర్ఎస్ నాయకుడు తాండ్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.