ఖలీల్వాడీ, అక్టోబర్ 16: రేవంత్రెడ్డి సర్కార్ మాదిగ జాతిని వంచించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. నమ్మకద్రోహానికి గురైన మాదిగలు రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొందని, ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘా ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. రాష్ర్టాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఆదేశాలు జారీ చేసిందని, అయి నా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణలోని మాలల ఒత్తిడితో రేవంత్రెడ్డి సర్కారు వర్గీకరణను తొక్కి పెట్టేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.