హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మందా జగన్నాథం మంత్రి కేటీఆర్ను కలిసి తనను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.