హైదరాబాద్ సిటిబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ‘తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసిన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శనివారం డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రొఫెసర్ భట్టు రమేశ్ పర్యవేక్షణలో మామిడి హరికృష్ణ విస్తృత స్థాయిలో పరిశోధన చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. 90 ఏండ్ల తెలుగు సినీ ప్రస్థానంలో దాదాపు 8600పైగా చలన చిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో ప్రస్తుతించారు.