చేర్యాల, మార్చి 14 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 9వ ఆదివారం సందర్భంగా రూ.46,92,894 ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి విలేకరులకు తెలిపారు. సోమవారం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం రూ.4,77,908, ఆదివారం రూ.42,14,986 ఆదాయం స్వామి వారికి ఖజానాకు సమకూరిందన్నారు.
8వ ఆదివారం సందర్భంగా స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శనాలు, కాటేజీలు తదితర వాటి ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరం కరోనా ప్రభావంతో భక్తుల రాక తక్కువగా ఉందని, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఆదాయం సైతం పెరుగుతున్నట్లు తెలిపారు.