Kothakota Dayakar Reddy | మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దయాకర్రెడ్డి మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొత్తకోట దయాకర్రెడ్డి స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి దయాకర్రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు అమరచింత, ఒకసారి మక్తల్ నుంచి ఆయన గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.