హైదరాబాద్, జూన్ 7: పెయిం ట్స్ రంగంలో టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. యూత్ ఐకాన్గా మారిన ప్రిన్స్ మహేశ్ బాబు ప్రచారంతో సంస్థ బ్రాండ్ ఇమేజ్ మెరుగుపడనున్నదని, దేశీయ పెయింట్స్ రంగంలోసుస్థిరమైన స్థానం సంపాదించడానికి వీలు పడనున్నదని ఫార్చూన్ గ్రూపు ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
తెలుగు రాష్ర్టాల్లో రూ.12 వేల కోట్ల స్థాయిలో ఉన్న పెయింట్స్ పరిశ్రమలో 25 శాతం వాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి కార్యక్రమంలో భాగంగా 26 వేల పాఠశాలకు రంగులు వేసే అతిపెద్ద ప్రాజెక్టును దక్కించుకున్నట్టు తెలిపారు.