హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విశాఖలో మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్, దొంగ.. మైచర్ల గణేశ్ను మహబూబ్నగర్ రైల్వే ప్రొటెక్షన్ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు అరెస్టు చేసినట్టు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ డీజీ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్లో సెం ట్రింగ్ పని చేసే గణేశ్పై ఆంధ్రప్రదేశ్లో 28 కేసులు ఉన్నట్టు చెప్పారు.
శుక్రవారం మహబూబ్నగర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన గణేశ్ను అదుపులోకి తీసుకొని వేలిముద్రలు తనిఖీ చేయగా.. ఏపీలో అతడిపై నమోదైన కేసులు వివరాలు తెలిసినట్టు పేర్కొన్నారు. మూడేండ్ల క్రితం తెలంగాణకు వచ్చిన గణేశ్.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.