బాలానగర్, మే 22 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్డతండా పాఠశాలను సందర్శించారు. బడిలో ప్రారంభించిన పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందన్నారు. అన్ని సదుపాయాలతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.