సదాశివపేట ;సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించాల్సిన సభ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. కార్యకర్తలు సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు సభ జరుగుతుండగానే భోజనాల కోసం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.