హన్వాడ, ఫిబ్రవరి 20 : కొడుకు మృతిని తట్టుకోలేక కన్న తల్లి హఠాన్మరణం చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథ నం మేరకు.. హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన దొబ్బడి కృష్ణయ్య (40) కూలి పనులు చేస్తూ జీనవం సాగించేవాడు. కొద్దిరోజులుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడు.
ఈ క్రమంలో శుక్రవా రం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి బాలమ్మ(80)కు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందింది. ఒకే కు టుంబంలో తల్లీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.