మహబూబ్నగర్: క్రీడలను పోత్సహించడంతో పాటు క్రీడా లక్ష్యాలను సాధిస్తూ అగ్రశ్రేణి క్రీడా దేశంగా తీర్చిదిద్దడానికి కేంద్రం క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి అవసరమైన ప్రణాళికలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ర్టాన్ని క్రీడాహాబ్గా రూపొందించేందుకు సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని తెలిపారు. అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించడానికి వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో క్రీడ ల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఖేల్ ఇండియా కార్యక్రమాన్ని తెలంగాణలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలైన షూటింగ్ రేంజ్, ఆక్వాటిక్స్, బ్యాడ్మింటన్, రెండు సింథటిక్ ట్రాక్స్, రెండు అస్ట్రోటర్స్, మాకీ గ్రౌండ్స్లతో పాటు క్రీడల మౌలి క సదుపాయాల కల్పన కోసం రూ.52 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించామని, వాటికి ఆమోదం తెలుపాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, అదిలాబాద్, హాకీంపేట్లో మూడు క్రీడా పాఠశాలలున్నాయన్నారు. తెలంగాణ రాష్ర్టానికి మరో మూడు క్రీడా పాఠశాలలను కేటాయించాలని కోరారు. ఈ వర్చువల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడా పర్యాటక సంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్. శ్రీనివాసరాజు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.