హైదరాబాద్, మార్చి 23, (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
వీరిలో జస్టిస్ సుజయ్పాల్తో ఈ నెల 26న, జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.