కోనరావుపేట (వేములవాడ);ప్రకృతిపై ఉన్న ప్రేమను పెండ్లి కార్డులోనూ చూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మంచాల జ్ఞానేందర్, శ్రీలక్ష్మి దంపతులు. ఫిబ్రవరి 24న జరిగే తన కూతురు శరణ్య వివాహానికి వినూత్న రీతిలో ఆహ్వాన పత్రికలు తయారు చేయించారు. వివాహం జరిగిన తర్వాత ఈ కార్డును మట్టితో కూడిన పాత్రలో పెడితే రెండు రోజుల తరువాత అందులో నుంచి తులసి మొక్క బయటకు రావడం ఈ కార్డు ప్రత్యేకత అని వారు చెప్తున్నారు.