ప్రచారం: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్తులకు కేటాయించిన నిధులు ‘లోకల్ బాడీ ఫండ్స్పై ఫ్రీజింగ్’ అంటూ సోమవారం ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఫండ్స్ ఫ్రీజింగ్ అనేది కామన్ అయిపోయిందని కథనంలో పేర్కొనడాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఖండించారు. అది పూర్తిగా అబద్ధమని స్పష్టంచేశారు.
వాస్తవం: జిల్లా, మండల పరిషత్తులకు కేటాయించిన నిధులు ఫ్రీజింగ్ కాలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ శరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లా, మండల పరిషత్తులను మరింత బలోపేతం చేయడానికి, అభివృద్ధి పనులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులకు అదనంగా కేటాయించినట్టు వివరించారు. మొదటి విడతగా రూ.250 కోట్లు విడుదలయ్యాయని, పరిషత్తుల ఖాతాల్లో జమయ్యాయని పేర్కొన్నారు. జమైన నిధుల ఫ్రీజింగ్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదని కమిషనర్ స్పష్టంచేశారు.